ETV Bharat / state

లంకల్లో వరదలు.. గ్రామాల్లోకి జింకలు

author img

By

Published : Aug 18, 2020, 5:23 PM IST

గోదావరి వరదలతో తూర్పు గోదావరి జిల్లా లంకల్లో నీరు ఏరులై పారుతోంది. ఆ ప్రాంతంలో ఉన్న జంతువులు సమీప గ్రామాల్లోకి వెళ్తున్నాయి. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోకి రెండు జింకలు ప్రవేశించాయి. స్థానికులు వాటిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు.

లంకల్లో వరదతో గ్రామాల్లోకి వస్తున్న జింకలు
లంకల్లో వరదతో గ్రామాల్లోకి వస్తున్న జింకలు

గోదావరి లంకల్లో వరదల వల్ల జంతువులు జనావాసాల్లో వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో రెండు జింకలు హల్ చల్ చేశాయి. మండలంలోని నారాయణలంకలో జింకలు ఆవాసం పొందుతూ ఉంటాయి.

గత వారం రోజులుగా భారీ వర్షాలు, వరదపోటు లంకల్లోకి నీరు చేరింది. దీంతో జింకలు సమీప గ్రామాల్లోకి రావడంపై.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పందించారు. స్థానిక యువకుల సహాయంతో వాటిని పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

ఇదీ చదవండి:

కాటన్​ బ్యారేజి వద్ద తగ్గని వరద ఉద్ధృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.