ETV Bharat / state

రాష్ట్రంలో అరాచక పాలన: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

author img

By

Published : Nov 6, 2022, 5:39 PM IST

CPI Ramakrishna: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రానికి ఏం చేశారని ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నారన్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా నవంబర్ 11, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

CPI Ramakrishna
CPI Ramakrishna

CPI Ramakrishna: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడ దాసరి భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు అర్ధరాత్రుళ్ళు గోడలు దూకి.. దొంగల్లా అరెస్టులు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడి కాన్వాయ్​పై రాళ్లు వేయించారు. అధికారంలో ఉండి ఏదైనా చేయొచ్చు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలన్నీ గాలికి వదిలేశారు. రాష్ట్రానికి ఏం చేశారని ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నారన్నారు. రాష్ట్రం కోసం కాదు.. మీ కేసుల నుంచి రక్షణ కోసం మోదీకి ఊడిగం చేస్తున్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా నవంబర్ 11, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.