ETV Bharat / state

ఏపీలో కొత్తగా 74 కరోనా కేసులు..ఇద్దరు మృతి

author img

By

Published : Mar 8, 2021, 7:52 PM IST

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,90,766కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

ఏపీలో కొత్తగా 74 కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 74 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 74 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 25,907 నమూనాలను పరీక్షించగా తాజాగా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,90,766కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7176కి చేరింది. 24 గంటల్లో 61 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1009 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,62,086 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఏపీలో కొత్తగా 74 కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 74 కరోనా కేసులు

ఇవీ చదవండి

రాజ్​భవన్​లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.