ETV Bharat / state

పోలీసుల మానవత్వం.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి వైద్య సహాయం

author img

By

Published : Apr 27, 2021, 8:03 PM IST

కరోనా సోకి.. ఊపిరి అందక వీధి అరుగుపై పడి ఉన్న ఓ వ్యక్తిని.. రాత్రి విధుల్లో ఉన్న పోలీసులు రక్షించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో జరిగింది. సకాలంలో వైద్యం అందేలా ఏర్పాటు చేసి అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని రక్షించిన పోలీసులు పలువురు అభినందిస్తున్నారు.

cops helps a man
cops helps a man

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామంలో.. కరోనా సోకిన వ్యక్తి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతుండటంతో పోలీసులు సహాయం చేశారు. కర్ఫ్యూ కారణంగా.. కానిస్టేబుళ్లు చిన్ని, శ్రీను లు రాత్రి విధులు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకి.. ఆక్సిజన్ అందక ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు.. వెంటనే ఎస్సై నాగరాజుకు సమాచారం అందించారు. ఆయన లక్కవరం పీహెచ్​సీ వైద్యాధికారులతో చర్చించి ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేసి అంబులెన్సులో అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని సమయానికి రక్షించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి: స్ట్రెచర్​ లేక స్కూటీపైనే ఐసీయూకు కొవిడ్ రోగి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.