ETV Bharat / state

బైరెడ్డిపల్లిలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ ఫ్లెక్సీలు చించేసి మరీ దాడి

author img

By

Published : Jan 31, 2023, 11:05 PM IST

YSRCP activists tear down  Lokesh banners
YSRCP activists tear down Lokesh banners

YCP attacked TDP workers in AP: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. యువగళం పాదయాత్ర ముగిశాక లోకేశ్‌ రాత్రి బస ప్రదేశానికి చేరుకున్నారు. ఆ వెంటనే వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లను చించేసి, దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.

YSRCP activists tear down Lokesh banners: రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ అండదండలతో వైసీపీ కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోతున్నారు. టీడీపీ నేతలే లక్ష్యంగా చేసుకొని వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘనటలపై పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. అధికార వైసీపీ నేతలకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. యువగళం పాదయాత్ర ముగిశాక లోకేశ్‌ రాత్రి బస ప్రదేశానికి చేరుకున్నారు. ఆ వెంటనే వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లను చించేసి, దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను ఇంటికి పంపించేశారు. ఐతే దాడి చేసిన వైసీపీ వారిని పోలీసులు అడ్డుకోలేదని టీడీపీ నేతలు ఆరోపించారు.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.