ETV Bharat / state

తెదేపా బ్యానర్లను ధ్వంసం చేసిన వైకాపా నాయకులు

author img

By

Published : Jul 2, 2019, 7:45 AM IST

తెదేపా బ్యానర్లను ధ్వంసం చేసిన వైకాపా నాయకులు

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా ఏర్పాటైన బ్యానర్లను వైకాపా నాయకులు ధ్వంసం చేశారు.

తెదేపా బ్యానర్లను ధ్వంసం చేసిన వైకాపా నాయకులు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో తెదేపా ఏర్పాటు చేసిన బ్యానర్లను వైయస్​ఆర్ పార్టీ కార్యకర్తలు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన బ్యానర్పై వైకాపా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ బ్యానర్లకు అడ్డుగా తెదేపా బ్యానర్లను ఏర్పాటు చేయకూడదని డిమాండ్ చేశారు. తెదేపా కార్యకర్తలు ఒప్పుకోలేదు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయి, తెదేపా బ్యానర్లను ధ్వంసం చేశారు. చంద్రబాబు ఫోటోలు ఉన్న బ్యానర్లనూ చించివేశారు. ఆగ్రహించిన తెదేపా నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పోటీగా వైకాపా నాయకులూ ధర్నా చేపట్టారు. రాత్రి 12 వరకు పరస్పర ధర్నాల నినాదాలతో మండల కేంద్రం అట్టుడికిపోయింది.

ఇవి కూడా చదవండి:

'తిరుపతిలో రెండు నారాయణ కళాశాల భవనాలు సీజ్'

Intro:రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మధ్యాహ్నానికి 600 అర్జీలు నమోదు కావడం విశేషం. ఇందులో స్పందన కు సంబంధించి అర్జీదారులకు ఇచ్చే రసీదు విషయంలో జోప్యం చోటుచేసుకుంది. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కొంత ఘర్షణ చోటు చేసుకుంది.Body:TConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.