చిత్తూరు జిల్లా తరిగొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు గజవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో కళాకారులు మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ స్వామివారిని ఊరేగించారు. గోవింద నామస్మరణలతో ప్రాంగణమంతా మారుమ్రోగింది.
తరిగొండలో 'గజ వాహనంపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఊరేగింపు'
తరిగొండలో 'గజ వాహనంపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఊరేగింపు'