ETV Bharat / state

తుపాకీ మిస్​ఫైర్.. తిరుపతి సబ్ జైలు సెంట్రీగార్డు మృతి

author img

By

Published : May 8, 2021, 9:28 PM IST

తుపాకీ మిస్​ఫైర్.. తిరుపతి సబ్ జైలు సెంట్రీగార్డు మృతి
తుపాకీ మిస్​ఫైర్.. తిరుపతి సబ్ జైలు సెంట్రీగార్డు మృతి

తుపాకీ మిస్​ఫైర్ కావడంతో తిరుపతి సబ్​జైలులో విధులు నిర్వహిస్తున్న సెంట్రీ గార్డు లక్ష్మీనారాయణ రెడ్డి మృతి చెందాడు. విధులు మారే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా తిరుపతి సబ్​జైలులో తుపాకీ మిస్ ఫైర్ జరగడంతో సెంట్రీగార్డు లక్ష్మీనారాయణ మృతి చెందాడు. రాత్రి విధులు నిర్వహించేందుకు వేరే సెంట్రీ రావడంతో.. తుపాకీని అతనికి అప్పగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి ఇటీవలే తిరుపతి సబ్ జైలుకు అటాచ్ మెంట్​పై లక్ష్మీ నారాయణ రెడ్డి వచ్చారు. తుపాకీ మిస్ ఫైర్​తో మరణించిన అతడి మృత దేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఇదీ చదవండి: తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడి విఫలయత్నం.. కానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.