ETV Bharat / state

రోడ్డు పక్కకు ఒరిగిన బస్సు.. 15 మందికి గాయాలు

author img

By

Published : Jan 18, 2020, 10:14 PM IST

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎడంవారిపల్లె వద్ద రోడ్డు పక్కకు ఒరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

road accident takes place at edamvaripalle in chittor district
road accident takes place at edamvaripalle in chittor district

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం...15మందికి గాయాలు

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం ఎడంవారిపల్లె వద్ద మదనపల్లి డిపోకు చెందిన బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగింది. తిరుపతి నుంచి మదనపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 15 మంది ప్రయాణికులకు గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్​లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అతి వేగంగా నడిపిన కారణంగానే.. ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు. టైర్ పంచర్ అయ్యి స్టీరింగ్ కంట్రోల్ కాకపోవటం వల్లే ఘటన జరిగిందని డ్రైవర్ చెప్పాడు.

ఇదీ చదవండి:

విజయవాడలో ప్రైవేటు బస్సుల ఆకస్మిక తనిఖీలు

Intro:చిన్నగొట్టిగల్లు మండలంలో బస్సు ప్రమాదం.Body:Ap_tpt_39_18_bus_pramadam_av_ap10100

మదనపల్లి నుండి తిరుపతికి వస్తున్న మదనపల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.చిన్నగొట్టిగల్లు మండలం ఎడంవారిపల్లె వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.గాయపడ్డవారిని 108లో తిరుపతి రూయకు తరలించారు.బస్సు డ్రైవర్ అతి వేగంగా నడపడం తో ఈ ప్రమాదం జరిగింది అని ప్రయాణికులు చెబుతున్నారు. టైర్ పంచర్ అయ్యి స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది అని డ్రైవర్ చెప్పారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.