ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమారుడు మృతి !

author img

By

Published : Jun 7, 2020, 3:16 PM IST

రోడ్డు ప్రమాదం తండ్రీ, కుమారుడిని కబళించింది. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లాలోని కర్నూలు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అక్కంచెరువుపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో కల్లూరుకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమారుడు మృతి !
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కుమారుడు మృతి !

చిత్తూరు జిల్లా కర్నూలు జాతీయ రాహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి అక్కంచెరువుపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఈ ప్రమాదంలో తండ్రీ ఖాదర్ భాషా, కుమారుడు తబ్రోజ్ అక్కడిక్కడే మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తుండగా ఒకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతులు కల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.