చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలం నెరబైలు సమీపంలో ఓ ఎర్రచందనం కూలీ అనుమానాస్పదంగా మరణించాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో మృతుని వద్ద మూటలో కట్టిన దుస్తులు, ఐదు వందల రూపాయల నగదును పోలీసులు గుర్తించారు. సుమారు నాలుగు రోజుల క్రితం మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరణించిన వ్యక్తి తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే వరుసగా ఎర్రచందనం కూలీలు మృతి చెందటంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:
స్మగ్లర్ల ఆట కట్టించిన పోలీసులు.. రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం