ETV Bharat / state

తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ మిథున్ రెడ్డి

author img

By

Published : Nov 29, 2020, 8:25 PM IST

rajampet mp mithun reddy visits cyclone affected areas in punganur at chittor
తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ మిథున్ రెడ్డి

చిత్తూరులో తుపాను ధాటికి తెగిపోయిన వంతెనలు, ధ్వంసమైన కల్వర్టులను... కడప జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పరిశీలించారు. పుంగనూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.


నివర్ తుపాను కారణంగా అతలాకుతలమైన చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ప్రాంతాలను... కడప జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పరిశీలించారు. కేవీ పల్లి, పుంగనూరు, సదుం మండలల్లో పర్యటించిన ఆయన.. తుపాను ధాటికి తెగిపోయిన వంతెనలు, ధ్వంసమైన కల్వర్టులను పరిశీలించారు. వీలైనంత త్వరగా వాటికి మరమ్మతులు చేసి... జనజీవనాన్ని పునరుద్ధరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

నివర్ ఎఫెక్ట్: కృష్ణా డెల్టా రైతులకు కన్నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.