చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేట ప్రాథమిక పాఠశాలలో... ఉపాధ్యాయులు కరువయ్యారు. 5 నెలలుగా... ఒకటొ తరగతి నుంచి ఐదో తరగతి వరకు 52 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ఒకే ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతోంది. ఎంఈవోకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... స్పందించటంలేదని... స్పందన కార్యక్రమంలోనూ ఈ సమస్యను పరిష్కరించాలని కోరినట్టు గ్రామస్థులు, ఉపాధ్యాయురాలు తెలిపారు. అధికారులు స్పందించి... ఉపాధ్యాయుల కొరత తీర్చాలని విద్యార్థులు, గ్రామస్థులు కోరుతున్నారు. ఇదిలాఉండగా పాఠశాల భవనం పెచ్చులూడి... పిల్లలపై పడి గాయాలవుతున్నాయి. భవనానికి మరమ్మతు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: పాఠశాలలో పాము... పరుగులు తీసిన విద్యార్థులు