ETV Bharat / state

MOTHER SON DIED: ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి

author img

By

Published : Jan 17, 2022, 3:45 AM IST

MOTHER SON DIED: చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి
ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి

MOTHER SON DIED: నీటిలో మునిగిపోతున్న తనయుడిని కాపాడబోయి అతనితో పాటు తల్లి కూడా మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపారలో ఆదివారం జరిగింది. స్థానికురాలైన కవిత (35) తన మతిస్థిమితం లేని కొడుకు డిల్లీ(15) తీసుకుని దుస్తులు ఉతికేందుకు ఇంటికి సమీపంలోని అప్పాయగుంటకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కుమారుడు కాలు జారీ నీటిలో పడిపోగా కాపాడేందుకు ఆమె చెరువులోకి దిగింది. అతడు తల్లిని గట్టిగా పట్టుకోవటంతో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరూ ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ దుస్తులు ఉండటం, వారు కనిపించకపోవటంతో అనుమానంతో చెరువులో వెతకగా మృతదేహలు దొరికాయి. దీనిపై గుడిపాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

సరికొత్త కమిటీ ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఎందుకోసమంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.