ETV Bharat / state

మత్తుపదార్థాల వాడకంపై తిరుపతి అర్బన్ ఎస్పీకి ఎమ్మెల్యే భూమన ఫిర్యాదు

author img

By

Published : May 28, 2021, 8:07 AM IST

తిరుపతిలో గంజాయి, మత్తుపదార్థాల వాడకం పెరిగిపోతోందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్​ రెడ్డి​ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నగరంలో మత్తు పదార్థాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

complaint to sp
ఎస్పీకి ఫిర్యాదు ఇస్తున్న ఎమ్మెల్యే భూమన

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో గంజాయి, మత్తుపదార్థాల వాడకం పెరిగిపోతోందని ఎమ్మెల్యే భూమన కరుణాకర్​ రెడ్డి​ తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడుకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే… మత్తులో మునిగి తేలుతున్న ఎంతో మంది యువకులను గమనిస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల వల్ల దేశానికి వెన్నెముక లాంటి యువత పెడదారి పడుతుందని… అది మంచి పరిణామం కాదన్నారు. గంజాయి వాడకాన్ని నియంత్రించాలని, దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: తితిదే కమిటీదే విజయమని న్యాయ నిర్ణేత చెప్పారు : పండిత పరిషత్ కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.