ETV Bharat / state

హోంఐసోలేషన్​లోని కరోనా రోగులను పరామర్శించిన జాయింట్ కలెక్టర్

author img

By

Published : May 20, 2021, 10:19 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో హోం ఐసోలేషన్​లో ఉన్న కరోనా రోగులను జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరామర్శించారు. వైద్యులు సూచించిన సలహాలను పాటిస్తూ మందులను వాడాలని తెలిపారు.

వివరాలను  అడిగి తెలుసుకుంటున్న జాయింట్ కలెక్టర్
వివరాలను అడిగి తెలుసుకుంటున్న జాయింట్ కలెక్టర్

చిత్తూరు జిల్లా శ్రీకాళ హస్తిలో హోం ఐసోలేషన్​లో ఉన్న రోగులను జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరామర్శించారు. వారి ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సూచించిన సలహాలను పాటిస్తూ మందులను వాడాలని తెలిపారు.

కుటుంబ సభ్యులకు ఇబ్బందులు లేకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నుంచి కోలుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే సంబంధిత వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 22,610 కరోనా కేసులు, 114 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.