ETV Bharat / state

జనవరిలో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం

author img

By

Published : Feb 11, 2021, 9:01 PM IST

కరోనా ప్రభావంతో ఆదాయ మార్గాలు కోల్పోయినప్పటికీ... తిరుమల శ్రీవారి హుండీకి మాత్రం యథావిధిగా ఆదాయం సమకూరుతోంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిమితంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నప్పటికీ... గడిచిన నెలలో రూ.83.87 కోట్లు ఆదాయం లభించింది.

huge-income-gather-for-tirumala-hundi-in-january
జనవరిలో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం

కరోనా కారణంగా గతేడాది మార్చి 21 నుంచి శ్రీవారి దర్శనాలను రద్దు చేసిన తితిదే... వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత జూన్ 8 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనానికి అనుమతిచ్చింది. గతంలో శ్రీవారి హుండీ ఆదాయం నిత్యం రూ.2.50 కోట్లు నుంచి రూ.3.50 కోట్లు వరకు ఉండేది.

ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 40 వేలలోపే ఉంటోంది. గతేడాది జనవరిలో 22.89 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా... రూ.94.9 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది జనవరిలో కేవలం 12.64 లక్షల మంది భక్తులు తిరుమలేశుని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.83.87 కోట్లు సమకూరింది.

ఇదీ చదవండి:

ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ.. అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.