చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న శేషాచల అడవుల్లో ఏనుగులు గుంపులు అధికమయ్యాయి. చంద్రగిరి మండలంలోని అటవీ సమీప పంట పొలాలపై కొన్ని రోజులుగా ఏనుగులు దాడులు చేస్తున్నా... అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి అందిన పంట తమ నోటి దాకా రావడం లేదని ఆందోళనకు గురవుతున్నారు. వరి, మామిడి పంటలతో పాటుగా రైతులు వేసుకున్న పైపులైన్లు సైతం నాశనం చేస్తున్నాయి. సుమారు అరవై ఏనుగులు.. గుంపులుగా విడిపోయి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళ్యం, చిన్నగొట్టిగళ్ళు, చంద్రగిరి మండలాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
పంట పొలాలపై ఏనుగుల దాడులు...
శేషాచల అడవుల్లో ఏనుగులు గుంపులు అధికమయ్యాయి. సుమారు అరవై ఏనుగులు గుంపులుగా విడిపోయి... నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లోకి ప్రవేశించి పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
![పంట పొలాలపై ఏనుగుల దాడులు... elephants attacks near seshachalam forest farming lands at chittor district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6426674-276-6426674-1584350767200.jpg?imwidth=3840)
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న శేషాచల అడవుల్లో ఏనుగులు గుంపులు అధికమయ్యాయి. చంద్రగిరి మండలంలోని అటవీ సమీప పంట పొలాలపై కొన్ని రోజులుగా ఏనుగులు దాడులు చేస్తున్నా... అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి అందిన పంట తమ నోటి దాకా రావడం లేదని ఆందోళనకు గురవుతున్నారు. వరి, మామిడి పంటలతో పాటుగా రైతులు వేసుకున్న పైపులైన్లు సైతం నాశనం చేస్తున్నాయి. సుమారు అరవై ఏనుగులు.. గుంపులుగా విడిపోయి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళ్యం, చిన్నగొట్టిగళ్ళు, చంద్రగిరి మండలాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.