ETV Bharat / state

సోమల మండలంలో ఏనుగులు హల్ చల్

author img

By

Published : Dec 17, 2020, 1:00 PM IST

Updated : Dec 17, 2020, 1:26 PM IST

చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. రాత్రిళ్లు పొలాల వైపు సంచరిస్తూ పలు గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. వాటిని తమ గ్రామాల వైపు రాకుండా చేసి తమ పంటలను కాపాడాలని అధికారులను రైతులు వేడుకుంటున్నారు.

ధ్వంసమైన పంట

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో రెండు రోజులుగా ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. రాత్రిళ్లు పొలాల వైపు సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. దేవలకుప్పం, బయరెడ్డిపల్లె, రామకృష్ణారెడ్డి కాలనీ గ్రామాల పరిధిలో రైతులు ఏనుగుల దాటికి తీవ్రంగా నష్టపోతున్నారు. రెవెన్యూ అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి... అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. ఏనుగులను తమ గ్రామాల వైపు రాకుండా చేసి తమ పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి : నివర్ తుపాను నష్టం అంచనా కోసం రాష్ట్రానికి కేంద్ర బృందాలు

Last Updated : Dec 17, 2020, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.