ETV Bharat / state

జిల్లాలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా ఉద్ధృతి

author img

By

Published : Jul 29, 2020, 9:23 PM IST

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. బుధవారం విడుదలైన హెల్త్ బులిటెన్​లో జిల్లా వ్యాప్తంగా కొత్తగా 819 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతి నగరంలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో.. నగరంలో 14 రోజుల పాటు లాక్​డౌన్ విధించారు.

chittore covid latest update
చిత్తూరులో పెరుగుతున్న కరోనా బాధితులు

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. బుధవారం ఒక్కరోజే జిల్లాలో 819 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9,080కి చేరుకుంది. బుధవారం మరో ఏడుగురు కరోనాకు బలవ్వటంతో.. ఇప్పటి వరకు 95 మంది మరణించారు. 4,898 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా... 4,087 మంది చికిత్స పొందుతున్నారు.

తిరుపతిలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదు కావటంతో.. 14 రోజుల పాటు లాక్​డౌన్ విధించారు. దుకాణాలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 11 తరువాత రహదారులపైకి వాహనాలను, ప్రజలు అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తిరుమల బైపాస్ రోడ్డుకి లాక్​డౌన్ నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: హోమ్‌ ఐసోలేషన్‌కే కరోనా బాధితుల మొగ్గు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.