ETV Bharat / state

'సీఎం జగన్ సమీక్షలు చేయడం తప్ప చేసిందేమీ లేదు'

author img

By

Published : Aug 7, 2020, 4:36 PM IST

అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సమీక్షలు చేయడం తప్ప సీఎం జగన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని చిత్తూరు జిల్లా పుత్తూరు తెదేపా నేత భానుప్రకాశ్ ఎద్దేవా చేశారు. వైకాపా నేతల కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు.

chittore district puttore tdp leader bhanu prakash criticises cm jagan
భానుప్రకాశ్, తెదేపా నేత

ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని చిత్తూరు జిల్లా పుత్తూరు తెదేపా నేత భానుప్రకాశ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సమీక్షలు చేయడం తప్ప.. చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రోజూ 10వేల కరోనా కేసులు నమోదవుతుంటే.. వ్యాప్తి కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రైవేటు ఆసుపత్రులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా కారణంగానే కరోనా కేసులు పెరిగాయని ఆరోపించారు.

ఇవీ చదవండి..

ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసేలా పని చేయాలి: జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.