ETV Bharat / state

శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

author img

By

Published : May 24, 2021, 9:50 PM IST

చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

arrest 8 red sandalwood smugglers at seshachalam forest
శేషాచల అటవీ ప్రాంతంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. నాగపట్ల వెస్ట్ బీట్‌ చీకిమానుకోన వద్ద 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లును అరెస్ట్ చేశారు. కూలీలకు నగదు అందిస్తూ స్మగ్లింగ్ సహకరిస్తున్న నిందితుడు హరిబాబు.. త్రుటిలో తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. స్మగ్లర్ల నుంచి రూ. 3 లక్షల విలువైన ఎనిమిది ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు రెండు నాటు తుపాకులు, నిత్యావసర వస్తువుల స్టేషన్​కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న హరిబాబు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి..

రూ. 18 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.