చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల ప్రజలకు నటుడు మోహన్బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు అండగా నిలిచారు. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడ ఉన్న పేద కుటుంబాలకు రోజుకు రెండు పూటల ఆహారం సరఫరా చేస్తున్నారు. లాక్డౌన్ను తొలగించే వరకూ ఇలా ఆహారం పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. ఇది కాకుండా రోజుకు ఎనిమిది టన్నుల కూరగాయల్ని ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోహన్బాబు చిత్తూరులోని మొదుగులపాలెంలో జన్మించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి :