ETV Bharat / state

8 గ్రామాల్ని దత్తత తీసుకున్న మోహన్‌బాబు

author img

By

Published : Apr 8, 2020, 7:25 AM IST

actor mohan babu and his son adapted villages in chittoor district
రోజుకు 8 టన్నుల కూరగాయలు పంపిణీ

ప్రముఖ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు కలిసి ఎనిమిది గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. పేద కుటుంబాలకు రోజుకు రెండు పూటల ఆహారం సరఫరా చేయడమే కాకుండా రోజుకు ఎనిమిది టన్నుల కూరగాయల్ని ఉచితంగా సరఫరా చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల ప్రజలకు నటుడు మోహన్​బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు అండగా నిలిచారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడ ఉన్న పేద కుటుంబాలకు రోజుకు రెండు పూటల ఆహారం సరఫరా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను తొలగించే వరకూ ఇలా ఆహారం పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. ఇది కాకుండా రోజుకు ఎనిమిది టన్నుల కూరగాయల్ని ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోహన్‌బాబు చిత్తూరులోని మొదుగులపాలెంలో జన్మించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి :

దత్తత గ్రామంలో విజయసాయి పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.