ETV Bharat / state

పెంచిన ధరలు తగ్గించాలని... చీరాలలో సీపీఎం కరపత్రాల పంపిణీ

author img

By

Published : May 25, 2022, 2:23 PM IST

CPM leaders
కరపత్రాలు పంపిణీ

చీరాలలో సీపీఎం ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్​, డీజిల్​, నిత్యవసరాల ధరలు తగ్గించాలని కరపత్రాలు పంపిణీ చేశారు. నిత్యవసరాల ధరలు పెంచి ప్రజలపై కేంద్రప్రభుత్వం మోయలేని భారాన్ని వేసిందని సీపీఎం నేత బాబారావు మండిపడ్డారు. పెంచిన ధరలను నిరసనగా ఈనెల 30న కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు.

బాపట్ల జిల్లా చీరాలలో సీపీఎం ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని పెట్రోల్ బంక్ వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని సీపీఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలు ఆదాయాన్ని కోల్పోయి నానా ఇబ్బందులు పడుతుంటే మోయలేని అధిక ధరల భారాన్ని మోపిందన్నారు. ఈ అధిక ధరలను నిరసిస్తూ ఈనెల 30న జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనకు శ్రీకారం చుట్టామని సీపీఎం నేత బాబురావు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.