ETV Bharat / state

గ్రామ వాలంటీర్ అనుమానాస్పద మృతి

author img

By

Published : Jul 14, 2020, 4:02 PM IST

అనంతపురం జిల్లా నీలకంఠపురంలో విషాదం నెలకొంది. గ్రామ వాలంటీర్​గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

village-volunteer-suspiciously-killed-in-neelakanthapuram-ananthapuram-district
గ్రామ వాలంటీర్ అనుమానాస్పద మృతి

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం గ్రామానికి చెందిన భాగ్యమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానిక గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటరీగా విధులు నిర్వహిస్తున్న భాగ్యమ్మకు, ఆమె భర్త వెంకటేష్​కు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి.. ఇద్దరూ ఘర్షణకు దిగారు. ఆవేశంలో వెంకటేష్ భాగ్యమ్మను హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నాడని తెలిపారు. వెంకటేష్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

ఇదీచదవండి.

'ప్రమాదాలు జరుగుతున్నా.. కంపెనీలకే వైకాపా వత్తాసు పలుకుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.