ETV Bharat / state

హత్య కుట్ర భగ్నం... పిస్టల్ స్వాధీనం

author img

By

Published : May 7, 2021, 4:20 PM IST

two people arrested in attempt murder case in dharmavaram
అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు

అనంతపురం జిల్లా ధర్మవరంలో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఒకరిని హతమార్చేందుకు సిద్ధమైన ఇద్దరిని అరెస్టు చేసి, వారి నుంచి ఓ పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హత్య చేయడానికి వెంట తెచ్చుకున్న పిస్టల్​ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. అనంతపురంలోని జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్​లో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ.. ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

"డీఎస్పీ రమాకాంత్ ఆదేశాలతో ధర్మవరం పోలీస్​స్టేషన్ పరిధిలోని యర్రగుంట్ల రైల్వే వంతెన వద్ద పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ వ్యక్తి వద్ద ఉన్న పిస్టల్​ గుర్తించారు. డీఎస్పీ రమాకాంత్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు సోదాలు చేసి.. కుట్ర విషయం తెలుసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు" అని ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

భారీ చోరీ కేసును ఛేదించిన చిత్తూరు పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.