ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కర్ణాటక వాసులు మృతి, నలుగురికి గాయాలు

author img

By

Published : Mar 1, 2021, 6:14 AM IST

road accident near madakasira
మడకశిర సమీపంలో రోడ్డు ప్రమాదం

చింతపండు లోడుతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం సరిహద్దుల్లోని కర్ణాటకకు చెందిన గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకకు చెందిన ఇద్దరు రైతులు ఇరువురు మరణించగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

మడకశిర సమీపంలో రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం సరిహద్దుల్లో.. చింతపండు లోడుతో వెళుతున్న బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు శిరా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతులు కర్ణాటకలోని కరేక్యాతనహళ్ళికి చెందిన రైతులుగా గుర్తించారు. బరుగూరు వద్ద వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విద్యుత్ నియంత్రికను ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.