ETV Bharat / state

తాళాలు పగలగొట్టి ఇంట్లో చోరీ.. బంగారు నగలు, నగదు అపహరణ

author img

By

Published : Aug 19, 2020, 11:23 PM IST

Theft in a locked house - 4 tulasgold, 25 thousand cash stolen
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ- 4 తులాల బంగారం,25వేల నగదు అపహరణ

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని న్యూసిపిఐ కాలనీలో మహమ్మద్ అనే కూరగాయల వ్యాపారి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి నాలుగు తులాల బంగారు నగలతో పాటు రూ.25 వేల నగదు చోరీ చేశారు.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని న్యూసిపిఐ కాలనీలో మహమ్మద్ అనే వ్యక్తి గత కొంత కాలంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పనిమీద భార్యాభర్తలిద్దరూ కలిసి తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.25 వేల నగదు చోరీ చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి: హార్లీడేవిడ్​సన్​పై స్వారీ..గుర్రంపై సవారీ.. ఖజనా ఉద్యోగి విలాసం....!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.