ETV Bharat / state

తాడిపత్రి అభివృద్ధి కోసం సీఎం​ను కలుస్తా: జేసీ ప్రభాకర్ రెడ్డి

author img

By

Published : Mar 18, 2021, 4:05 PM IST

Updated : Mar 18, 2021, 4:50 PM IST

tdp leader jc prabhakar reddy appointed as tadipathri municipality chairman
తాడిపత్రి పురపాలక ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

ఆసక్తిరేపిన అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక ఛైర్మన్‌ ఎన్నిక ఎట్టకేలకు తెలుగుదేశం వశమైంది. మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తాడిపత్రి అభివృద్ధి కోసం త్వరలోనే సీఎం జగన్​తో పాటు మంత్రులను కలుస్తానని తెలిపారు.

తాడిపత్రి పురపాలక ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

సేవ్ తాడిపత్రి అనే నినాదమే తన గెలుపునకు కారణమని తాడిపత్రి పురపాలక ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగానే కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా జరిగిందని ఆయన అన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులనూ త్వరలోనే కలుస్తానని వ్యాఖ్యానించారు. తాడిపత్రి అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే నిధులు తెస్తే ఆయన చెప్పిన వారికే కాంట్రాక్ట్ పనులను ఇస్తామని స్పష్టం చేశారు.


చేయూత అందిస్తాం...

తాడిపత్రిలో గత 30 సంవత్సరాలుగా ఇలా ప్రశాంతంగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. ఛైర్మన్ గా తెదేపా అధికారంలోకి వచ్చినా మేము తాడిపత్రి అభివృద్ధి కోసం అన్ని రకాల చేయూతను అందిస్తామని ఉద్ఘాటించారు.

ఇదీచదవండి

దోషులను గుర్తించి శిక్ష పడేలా చేయాలి: ఎమ్మెల్యే ఆర్కే

Last Updated :Mar 18, 2021, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.