ETV Bharat / state

పొంగుతున్న వాగులు..తెగుతున్న రహదారులు

author img

By

Published : Oct 12, 2019, 7:06 PM IST

కురుస్తున్న భారీ వర్షాల వలన అనంతపురం జిల్లాలో పలు గ్రామల రహదారులు తెగిపోయి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికార్లు తాత్కాలికంగానైనా సమస్యను పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

పొంగుతున్న వాగులు...తెగుతున్న రహదారులు

పొంగుతున్న వాగులు...తెగుతున్న రహదారులు

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు గ్రామాలు అతలకుతలం అయ్యాయి. రహదారులు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మడకశిర మండలం పత్తికుంట గ్రామం నుంచి రాకపోకలు సాగించే ప్రధాన రహదారి తెగిపోయింది. జాట్రపల్లి, పత్తికుంట గ్రామాల మధ్య ఉన్న మట్టి రహదారి కోతకు గురైంది. జాట్రపల్లి గ్రామ విద్యార్థులు పాఠశాలకు పొలం గట్లపైనే నడుస్తూ,తీవ్ర అవస్ధలు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రస్తుతానికి తాత్కాలికంగానైనా సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి : ఉధృతంగా వేదవతి,హగరి నదులు ప్రవాహం

Intro:కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బుడుగుంట పల్లి పంచాయతీ పరిధి లోని విద్యానగర్ లో విషాదం చోటుచేసుకుంది. మణికంఠ 22 సం. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


Body:బుడుగుంట పల్లి విద్యానగర్ కు చెందిన మణికంఠ 22 సంవత్సరముల యువకుడు. ఈరోజు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. అమ్మ కస్తూరి రోజు వారి కూలీ కి పోయింది. ఇంట్లో ఎవరూ లేని ఈ సమయంలో మణికంఠ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన అమ్మ కస్తూరి బోరున విలపిస్తూ ఉంది. ఏమైందో ఏమో ఉరి వేసుకున్నాడని అమ్మ కస్తూరి తెలిపింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. భర్త పది సంవత్సరముల ముందే ఆమెను వదిలి వెళ్ళిపోయాడు అని తెలిపింది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి జరిగిందని ఈ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపింది . ఈ సంఘటనతో విద్యానగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో తల్లి భోరున విలపిస్తుంది.


Conclusion:మణికంఠ మరణంతో బుడుగుంట పల్లి విద్యానగర్ లో విషాదం చోటుచేసుకుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.