ETV Bharat / state

రైతుకు భరోసా కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

author img

By

Published : May 31, 2020, 7:52 PM IST

MLA venkatramireddy started
రైతుకు భరోసా కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లులో నూతనంగా నిర్మించిన మూడు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు.

అనంతపురం జిల్లా గుంతకల్లులో మూడు రైతు భరోసా కేంద్రాలను వైకాపా ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. మొదటగా వైెఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కసాపురం నెట్టికంటి అంజనేయ స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని పూజలు చేసి ప్రారంభించారు.

పాత కొత్త చెరువులో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యేకు అక్కడ రైతులు ఘన స్వాగతం పలికారు. అలాగే గుంతకల్లులోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో నూతన యంత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు, వ్యవసాయాధికారులు, రెవెన్యూశాఖ అధికారులు, మార్కెట్ యార్డ్ కమిటీ అధికారులు పాల్గొని రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ఇవీ చూడండి...

'ఆ కార్యాలయాన్ని రైతు భరోసా కేంద్రంగా మార్చొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.