ETV Bharat / state

జగన్ ప్రభుత్వానికి బాలకృష్ణ తీవ్ర స్థాయిలో హెచ్చరిక

author img

By

Published : Jan 6, 2021, 2:51 PM IST

mla balakrishna warning to  ysrcp government about farmers at gollapuram
గోళ్లపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైకాపా ప్రభుత్వంపై తీవ్రంగా విరుచకుపడ్డారు. రైతులతో పెట్టుకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని.. హెచ్చరించారు. పాడైనపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఆయన మూడు రోజులు పర్యటించనున్నారు.

గోళ్లపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించనున్నారు. మొదటిరోజులో భాగంగా గోళ్లపురంలో కంది పంట పరిశీలించారు. వైకాపా ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రస్తుతం రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డాడు. రైతులను అన్ని విధాల ఆదుకోకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

రైతుపక్ష పార్టీ అని అధికారంలోకి వచ్చి ఇప్పుడేమో రైతుల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా నాయకులకు చట్టమంటే భయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకుడు తమ్ముడు పేకాటలో దొరికితే పది వేలు జరిమానా కట్టి తిరిగి వచ్చి మళ్లీ పేకాట ఆడుతాడననడం అందుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. రైతుల వెంట తెదేపా ఎల్లప్పుడూ ఉంటుందని వారి కోసం పోరాటాలు కొనసాగిస్తుందని అన్నారు.

ఇదీ చూడండి. అతని డ్రైవింగ్‌తో నా ప్రాణాలు పోతాయనుకున్నా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.