ETV Bharat / state

హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసిన మంత్రి శంకర్ నారాయణ

author img

By

Published : May 11, 2021, 2:50 PM IST

అనంతపురం జిల్లాలో మంత్రి శంకర నారాయణ కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పెనుకొండ పట్టణంలో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

minister shankar narayana
minister shankar narayana

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని తగిన చర్యలు చేపడుతోందని మంత్రి శంకర నారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. అందుకుగాను సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు.

మంత్రి శంకర్ నారాయణ పిచికారి చేసి ప్రజలకు కరోనా నియంత్రణకు పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలన్నారు.

ఇవీ చూడండి:

స్వాహా సొమ్ము చెల్లింపునకు అంగీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.