ETV Bharat / state

'కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాల అమలు'

author img

By

Published : May 16, 2021, 5:44 PM IST

రాష్ట్రం అప్పులపాలైందని..,అభివృద్ధి జరగటం లేదని ప్రతిపక్ష తెదేపా విమర్శించటం హాస్యాస్పదమని మంత్రి శంకరనారాయణ వ్యాఖ్యానించారు. కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపటం లేదన్నారు.

minister shankar narayana on welfare schemes in ap
'కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అమలు'

కరోనా కష్టకాలంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపటం లేదని మంత్రి శంకరనారాయణ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా నారాయణపురంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి గ్రామ సచిలవాలయాలు, రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని.., ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని మంత్రి తెలిపారు.

కరోనా సంక్షోభంలోనూ ఇంటి వద్దకే పథకాలు తీసుకెళ్తున్నామన్నారు మంత్రి శంకరనారాయణ. రాష్ట్రం అప్పులపాలైందని.., అభివృద్ధి జరగటం లేదని ప్రతిపక్ష తెదేపా విమర్శించటం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై బుదర జల్లడానికే చంద్రబాబు అండ్‌ కో ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తున్నారని మంత్రి కొనియాడారు.

ఇదీచదవండి

ముందు కరోనా కట్టడిపై దృష్టి పెట్టండి: సీపీఐ రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.