ETV Bharat / state

యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి: మంత్రి శంకరనారాయణ

author img

By

Published : Jan 13, 2021, 4:49 PM IST

యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, అందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి క్రికెట్ టోర్నమెంట్​ను ప్రారంభించారు.

Minister Sankaranarayana inaugurates the cricket tournament
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రి శంకరనారాయణ

యువత క్రీడల్లో రాణించాలని.. వాళ్ల నైపుణ్యం పెంచుకోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వైఎస్సార్, వకీలు పెద్దయ్య క్రికెట్ టోర్నమెంట్​ను ఆయన ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, అందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. క్రీడల పట్ల మంచి ఆసక్తి కనబరచిన వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభిస్తుందని శంకరనారాయణ పేర్కొన్నారు.

ఇవీ చూడండి...: చౌక ధరల దుకాణంలో నాసిరకం బియ్యం పంపిణీ.. లబ్ధిదారులు ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.