ETV Bharat / state

'కుటుంబంలో ప్రతి ఒక్కరికి జాబ్​ కార్డులు ఇవ్వండి'

author img

By

Published : Jul 8, 2020, 10:34 PM IST

కుటుంబంలో ప్రతి ఒక్కరికి జాబ్​ కార్డులు ఇవ్వాలని అనంతపురం జిల్లా జేసీ ఆదేశించారు. కరోనా లాక్​డౌన్​ కారణంగా స్వగ్రామాలకు వలస బాట పట్టినవారు ఉపాధి లేదు అని నిరాశ పడకుండా.. స్వస్ధలాల్లోనే పనులు చేసుకుంటూ సంతోషంగా జీవించాలని జేసీ-2 సిరి పేర్కొన్నారు.

jc visited sachivalayam
సచివాలయం సందర్శించిన జేసీ2 సిరి

కరోన వ్యాప్తి చెందుతున్న కారణంగా నగరాల్లో ఉపాధి పొందుతున్న గ్రామ ప్రజలు తిరిగి వారి స్వగ్రామాలకు వలస బాట పట్టారు. ఈ నేపథ్యంలో మడకశిర మండలం రేకులకుంట అనంతపురం గ్రామంలోని సచివాలయాన్ని జేసీ-2 సిరి సందర్శించారు. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి లేదని ఏ ఒక్కరూ చింతించాల్సిన అవసరం లేదన్న ఆమె ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి... : 'పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.