ETV Bharat / state

అక్రమంగా మద్యం తరలింపు.... కొనసాగుతున్న అరెస్టుల పర్వం

author img

By

Published : Jun 21, 2020, 6:36 PM IST

Illicit liquor seied by police in guntur and ananthapuram district
అక్రమ మద్యం... అరెస్టుల పర్వం

పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా... రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. ఎక్కడ తక్కువ ధరకు మద్యం లభిస్తే.. అక్కడి కొనేస్తున్నారు. రాష్ట్రంలోకి అక్రమంగా తరలించి... అమ్మేసి సొమ్ముచేసుకుంటున్నారు.

రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉండటం, కావాల్సిన బ్రాండ్లు దొరక్క పోవడంతో తెలంగాణ మద్యానికి డిమాండ్ పెరిగింది. దీంతో అక్రమార్కులు తెలంగాణ మద్యాన్ని రాష్ట్రానికి తీసుకువ‌చ్చి యధేచ్చగా విక్రయిస్తున్నారు. అధికారులు తనిఖీ చేస్తున్నా... అక్రమార్కులు రోజూ ఏదో ఒక చోట అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.

గుంటూరు జిల్లాలో తవుడు బస్తాల మధ్య మద్యం తరలిస్తుండగా రేవేంద్రపాడు వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని... 70 కేసుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని సూర్యాపేట నుంచి మద్యం తీసుకువస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. పట్టుబడిన సరుకు విలువ 5 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని... ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.

కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న 462 మద్యం ప్యాకెట్లను అనంతపురం జిల్లా ఉరవకొండ స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: 'తల్లి కాదు రాక్షసి.. ప్రియుడి కోసం పిల్లల్ని చంపింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.