అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామానికి చెందిన మల్లికార్జున అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన వేరొక రైతు వద్ద 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని... పొలం సాగు చేస్తున్నాడు. వేరుశెనగ పంట వేయగా... అది పూర్తిగా ఎండిపోయి...దాదాపు 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కుటుంబసభ్యులు తెలిపారు. అప్పుల భారం భరించలేక పొలంలో పురుగు ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: