ETV Bharat / state

Electricity: సామాన్యుల ఉసురు తీస్తున్న విద్యుత్​ శాఖ నిర్లక్ష్యం

author img

By

Published : Nov 3, 2022, 8:31 AM IST

Electricity
విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం

Negligence on power supply system maintenance: విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం.. సామాన్యుల ఉసురు తీస్తోంది. అనంతపురం జిల్లాలో విద్యుత్‌ తీగలు తెగిపడి కూలీలు మృతిచెందడం.. వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం.. నిర్లక్ష్యానికి అద్ధంపడుతోంది. విద్యుత్ సరఫరా వ్యవస్థ నిర్వహణను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం

Negligence on power supply system maintenance: దశాబ్దాల క్రితం వేసిన కరెంటు తీగలు.. మరమ్మతులు చేపట్టని విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం వెరసి నలుగురు కూలీలు కన్నుమూయగా మరో ముగ్గురు చావుబతుకుల మధ్య ఉన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దర్గాహొన్నూరులో.. పనులు ముగించుకుని ట్రాక్టర్‌ ఎక్కిన కూలీలపై విద్యుత్ వైరు తెగిపడింది. చనిపోయిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబీకులు కావడంతో బంధువులు రోదిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో ఈ తరహా ప్రమాదం రెండోది. గతంలో.. సత్యసాయి జిల్లాలో ఆటోపై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు చనిపోతే ఉడతపై నెపం నెట్టారు. ఆ ఘటన మరువక మందే మళ్లీ అలాంటి ప్రమాదమే జరిగింది. విద్యుత్ వైరు తెగి ట్రాక్టర్‌పై పడితే..ఇన్సులేటర్‌ దగ్గర మంటలు వచ్చి ప్రమాదం జరిగిందంటున్నారు. వేలకోట్లతో... స్మార్ట్‌ మీటర్లు బిగించడం,.. అస్మదీయులకు సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌లు ఇప్పించుకోవడంలో ఉన్న శ్రద్ధ విద్యుత్ పంపిణీ వ్యవస్థల.. బలోపేతంపై ప్రభుత్వం చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రమాదాలు జరిగాక పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం.. వార్షిక నిర్వహణ, విద్యుత్‌ పరికరాల నాణ్యతపై నిశిత పరిశీలన జరగడం లేదు. ప్రమాదాల నియంత్రణకు సబ్‌స్టేషన్లలో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థలు సరిగా పనిచేయకనే ప్రజల ప్రాణాలు పోతున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. విద్యుత్తు తీగలు తెగిపడిన వెంటనే ఎర్తింగ్‌ కావాలి. క్షణాల్లో ఆ లైన్లలో సరఫరా నిలిచిపోవాలి. కానీ ఆ విధంగా జరగడం లేదు.

కాలం చెల్లిన తీగల వల్లే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే వాదనా లేకపోలేదు. నాణ్యమైన తీగలు ఏర్పాటు చేస్తే 20 నుంచి 25 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ఈలోగా తీగలను అధికారులు తరచూ పరిశీలించి,.. బలహీనమైతే కొత్తవి ఏర్పాటు చేయాలి. దర్గాహొన్నూరులో తీగలను 20 ఏళ్ల కిందట ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తీగలపై ఓవర్‌ లోడ్‌ పడితే తెగడానికి ఆస్కారముంది. కానీ, ప్రమాదానికి కారణమైన తీగల్లో 60 యాంప్‌ల విద్యుత్తు ప్రవాహమే ఉంది. ఈ మాత్రం లోడ్‌కే తీగలు తెగడం విస్తుగొలుపుతోంది. సాధారణంగా విద్యుత్ తీగలు తెగిపడినప్పుడు 11 కేవీ సబ్‌స్టేషన్లలో బ్రేకర్లు వాటంతటవే పనిచేసి సరఫరా నిలిచిపోతుంది.

ఒకవేళ సాంకేతిక కారణాలతో అక్కడ విఫలమైతే., 33 కేవీసబ్‌స్టేషన్‌లో అయినా బ్రేకర్లు పనిచేయాలి. కానీ బుధవారం నాటి ప్రమాదంలో.. ఈ రెండు వ్యవస్థలు విఫలమయ్యాయి. ఏటా ఫిబ్రవరి నుంచి 3 నెలల పాటు విద్యుత్‌ లైన్ల నిర్వహణ పనులు చేపడతారు. నిర్వహణ సిబ్బంది స్వయంగా ప్రతి లైన్‌నూ పరిశీలించాలి. కిందికి జారిన తీగలు సరిచేయాలి. పాడైన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. లైన్లకు అడ్డంగా ఉన్న చెట్లు తొలగించాలి. ఈ పనుల పర్యవేక్షణ లేక ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.