అనంతపురం జిల్లా శింగనమలలో రాజధాని అంశంపై తెలుగు యువత కార్యకర్తలు... 24 గంటలు నిరసన దీక్ష చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. మూడు రాజధానులు వద్దు... అమరావతే ముద్దంటూ నినాదాలు చేశారు. విశాఖను రాజధాని చేస్తే... రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు వస్తాయని మండిపడ్డారు. రాయలసీమకు ప్రభుత్వం న్యాయం చేయలన్నారు.
భాజపా పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం
హిందూపురం పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో భాజపా పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తూ పాలన సాగాలన్నారు.
రాజధానిగా అమరావతినే కొనసాగించాలి
రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అమరావతి ఆంధ్రుల రాజధాని అంటూ పెద్ద సంఖ్యలో ప్రజా బ్యాలెట్ ద్వారా రాజధానిగా అమరావతికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
హిందూపురంలో రాజధానిపై అభిప్రాయసేకరణ
హిందూపురం ఇందిరమ్మ సర్కిల్ వద్ద బ్యాలెట్ల రూపంలో రాష్ట్ర రాజధానిపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఐక్య కార్యాచరణ సమితి నిర్వహించింది. ప్రజలు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మద్దతు తెలియచేశారు.
గుంతకల్లులో పోస్టల్ బ్యాలెట్
రాజధాని అంశంపై గుంతకల్లు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నాల్గవ రోజు పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. ప్రధాన కేంద్రాల్లో మూడు చోట్ల రాజధానిగా అమరావతి ఉండాలా? లేక విశాఖపట్నం ఉండాలా? నిర్ణయించాలంటూ ప్రజా రాజధాని, ప్రజాతీర్పు అంటూ కార్యక్రమం నిర్వహించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్తో పాటు సీపీఐ నాయకులు, అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం జరిపించారు.
ఇవీ చదవండి: