ETV Bharat / state

చిత్రావతి ముంపు బాధితులకు న్యాయం చేయాలి: గ్రామస్థులు

author img

By

Published : Oct 31, 2020, 6:24 PM IST

చిత్రావతి ముంపు బాధితులకు న్యాయం చేయాలని మరి మాకులపల్లి గ్రామస్థులు డిమాండ్ చేశారు. గ్రామంలోకి నీరు రావడం వల్ల గృహాలను తొలగించేందుకు అధికారులు రావడం వల్ల స్థానికులు నీటిలోకి దిగి నిరసన తెలిపారు.

chitravathi floods victims protest for compensation
చిత్రావతి ముంపు బాధితులకు న్యాయం చేయాలి: గ్రామస్థులు

అనంతపురం జిల్లా తాడిమరి మండలం మరిమాకులపల్లి గ్రామం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరద ముంపునకు గురవుతోంది. ప్రస్తుతం గ్రామంలోకి నీరు రావడం వల్ల అధికారులు గృహాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీన్ని వ్యతిరేకించిన స్థానికులు నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానిక ఆర్డీవో, డీఎస్​పీ, పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. అయితే ముంపు పరిహారం ఇవ్వాలని గ్రామస్థులు నీటిలోకి దిగి జల దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇదీ చూడండి:

అరెస్టైన వారిపై కేసు నమోదు చేస్తాం: ఎస్పీ అమ్మిరెడ్డి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.