ETV Bharat / state

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ఒకరు మృతి

author img

By

Published : Jan 5, 2021, 11:42 AM IST

ద్వి చక్ర వాహనాలు ఢీకొన్న ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.

bike accident
bike accident

విజయనగరం జిల్లా సీతానగరం మండలం కోట సీతారాంపురం గ్రామం సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. జియ్యమ్మవలస మండలం కన్నపదొర వలస గ్రామానికి చెందిన విద్యార్థి పాలకొండ అశోక్ గా.. మృతుడిని గుర్తించారు. వై.రాయుడు అనే మరో వ్యక్తి గాయపడ్డాడు. అశోక్.. తన బంధువుల ఇంటికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

వైరల్ వీడియో: మద్యం మత్తులో వ్యక్తిపై యువకులు దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.