ETV Bharat / state

రైతుపై ఎలుగుబంటి దాడి

author img

By

Published : Nov 23, 2020, 10:41 AM IST

అనంతపురం జిల్లా కుందుర్పిలో రైతుపై ఎలుగుబంటి దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచింది. ఉదయం వేళ రైతు పొలం పనులకు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది.

Bear attack on farmer at ananthapur kudhurpi
రైతుపై ఎలుగుబంటి దాడి

అనంతపురం జిల్లా కుందుర్పిలో రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రైతుకు తీవ్రగాయాలయ్యాయి. హనుమంతప్ప అనే రైతు ఉదయం పొలం పనులకు వెళ్తుండగా.. ఎలుగుబంటి, తన మూడు పిల్లలతో కలిసి దాడి చేసినట్లు స్థానికులు, కుటుంబీకులు తెలిపారు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారుడు గట్టిగా హారన్‌ కొట్టడంతో ఎలుగులు వదిలేసి వెళ్లినట్లు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన హనుమంతప్పను ప్రథమ చికిత్స అనంతరం.. అనంతపురం ఆసుపత్రికి తరలించారు. రైతు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

నేడు అభయం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.