ETV Bharat / state

spandana program issues: 'స్పందన' కరవు.. సమస్యలు పరిష్కరించండి మహాప్రభో..'

author img

By

Published : May 9, 2023, 12:09 PM IST

Updated : May 9, 2023, 4:04 PM IST

spandana program
spandana program

spandana Complainants fired on AP officers: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం 'స్పందన'పై ఫిర్యాదుదారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాళ్లరిగిపోయేలా కలెక్టర్‌ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఆఫీసర్లు ఏమాత్రం కనికరం చూపటంలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.

'స్పందన'కు స్పందన కరవు.. సమస్యలను పరిష్కరించండి మహాప్రభో..'

spandana Complainants fired on AP officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ‘స్పందన’ కార్యక్రమంపై ఫిర్యాదుదారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 జూన్ ​1వ తేదీన ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించగా.. మొదట్లో ఈ కార్యక్రమం చురుగ్గా కనిపించినప్పటికీ రానూరానూ విమర్శలకు గురవుతోంది. ప్రతి సోమవారం రోజున జరిగే ఈ 'స్పందన' కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదులిచ్చినా అధికారుల నుంచి ఎటువంటి స్పందనలేదని అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాళ్లరిగిపోయేలా కలెక్టర్‌ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆఫీసర్లు ఏమాత్రం కనికరం చూపటంలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అర్జీదారులు కోరుతున్నారు.

'స్పందన'కు అధికారుల స్పందన కరవు.. 'పదులసార్లు ఫిర్యాదులు ఇచ్చినా అధికారులు స్పందించటంలేదు.. మా భూమిని కబ్జాదారుల నుంచి అధికారులు కాపాడి, ఇప్పించాలంటూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఏమాత్రం కనికరం చూపటంలేదు.. మా ఇంటి స్థలాన్ని అక్రమంగా మరొకరు ఆక్రమించారని, ఇప్పటికీ 40 సార్లు స్పందనకు వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా కిందిస్థాయి అధికారుల నుంచి కనీసం స్పందన కూడా లేదు.' అంటూ అనంతపురం జిల్లాకు చెందిన బాధితులు ఆవేదన చెందుతున్నారు. సమస్యల పరిష్కారానికై కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం స్పందనకి వస్తున్న బాధితులను కదిలించగా అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు కనికరం చూపటం లేదు.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం చేపట్టిన స్పందన కార్యక్రమానికి వస్తున్న బాధితుల పట్ల అధికారులు శ్రద్ధ చూపటంలేదు. కాళ్లరిగిపోయేలా అర్జీదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న అధికారులు కనికరం చూపటంలేదు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే వారి ఎదుటనే సమస్యను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు పై అధికారులు ఆదేశాలిచ్చినా అవి అమలుకాని పరిస్థితి నెలకొంది. జిల్లా కలెక్టర్ మొదలుకొని వివిధ శాఖల అధికారులు కొలువుదీరి నిర్వహించే స్పందన కార్యక్రమంపై విమర్శలు తలెత్తుతున్నాయి.

స్పందనలో 70శాతం అవే ఫిర్యాదులు.. కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుదారుల్లో దాదాపు 70 శాతం మందికి పైగా భూములు, ఇంటి స్థలాల ఆక్రమణల సమస్యలతోనే వస్తున్నారు. భూమి కొలతలు వేయటంలేదని, పొరుగునున్న భూ యజమాని ఆక్రమించారని, అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారనే సమస్యలే అధికంగా వస్తున్నాయి. గ్రామాల్లో వృద్ధులు, అమాయకుల వ్యవసాయ భూములే అధికంగా అక్రమణలకు గురవుతున్నట్లు స్పందనకు వస్తున్న బాధితులను పరిశీలిస్తే తెలుస్తోంది. మండల తహసీల్దార్ స్థాయిలోనే సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్న కూడా, అక్కడి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో బాధితులు అధిక శ్రమ, ఖర్చుతో సుదూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందనకు విచ్చేస్తున్నారు.

సమస్యలను పరిష్కరించండి మహాప్రభో.!.. ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం బాధితులు.. జిల్లా కలెక్టర్‌కు, కిందిస్థాయి అధికారులకు రెండు చేతులెత్తి దండం పెడుతూ.. తమ సమస్యను తీర్చాలని కన్నీటితో వేడుకుంటున్నారు. కానీ, అధికారులు మాత్రం కనీస కనికరం చూపని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్థిక విషయాలతో సంబంధంలేని అంశాలను కూడా అధికారులు స్పందించి తీర్చకపోవడంపై బాధితుల ఆవేదన చెందుతున్నారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలన చేయకుండానే అన్నీ పరిష్కరించామంటూ కింది స్థాయి అధికారులు ఆన్‌లైన్‌లో సమాచారం అందిస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై, జిల్లా యంత్రాంగంపై చర్యలు తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని ఫిర్యాదుదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి

Last Updated :May 9, 2023, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.