ETV Bharat / state

'కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు'

author img

By

Published : Mar 27, 2020, 5:46 PM IST

ananthapuram mla
ananthapuram mla

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సూచించారు. వైరస్​ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

మీడియాతో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి

కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. అనంతపురంలోని పీటీసీ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ గృహ నిర్బంధాన్ని పాటించాలని వెంకట్రామిరెడ్డి కోరారు. ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అనంతపురంలో 7 ప్రదేశాల్లో కూరగాయల మార్కెట్​లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: రావద్దని పోలీసులు.. వస్తామని విద్యార్థులు.. సరిహద్దు ఉద్రిక్తం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.