ETV Bharat / state

రామ్​నగర్​ హత్య కేసును ఛేదించిన పోలీసులు

author img

By

Published : Sep 29, 2020, 2:15 PM IST

అనంతపురం జిల్లా కేంద్రం రామ్​నగర్​లో కలకలం సృష్టించిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగా హత్య జరిగినట్లు తెలిపిన పోలీసులు... నిందితున్ని అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపారు.

anantapur police crack mohammad rafi murder case
రామ్​నగర్​ హత్య కేసును ఛేదించిన పోలీసులు

అనంతపురంలో సంచలనం సృష్టించిన మహమ్మద్​ రఫీ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రఫీ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి స్థానిక రామ్​నగర్​లో నివాసముంటూ ఫోటోగ్రాఫర్​గా జీవనం సాగిస్తున్నాడు. అయితే పిల్లలను స్కూల్​కు తీసుకెళ్లే క్రమంలో నందమూరినగర్​కు చెందిన గోపి భార్యతో రఫీకి పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరూ తరచూ ఫోన్​లో మాట్లాడుకునే విషయం గోపికి తెలిసింది. ఫలితంగా వారి మధ్య వివాహేతర సంబంధం ఉందనే అనుమానంంతో రఫీ హత్యకు గోపి కుట్ర పన్నాడు.

ఆదివారం ఉదయం కత్తితో రఫీ గొంతు కోసి గాయపర్చగా అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. నిందితుడు గోపిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించామని...హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు.

ఇదీ చూడండి:

వ్యవసాయ బావిలో యువకుని మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.