ETV Bharat / state

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

author img

By

Published : Feb 26, 2021, 3:33 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక వన్నూరుస్వామి అనే రైతు తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Anantapur district Uravakonda mandal farmer commits suicide
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన వన్నూరుస్వామి అనే రైతు చేసిన అప్పును తీర్చలేక తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయం కోసం రూ. 6 లక్షలకు పైగా అప్పు చేసినట్లు మృతుని కుమారుడు శివశంకర్ తెలిపారు. అప్పును తీర్చలేక మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

మున్సిపల్ ఎన్నికలు: ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.