అనంతపురం జిల్లా పామిడి పట్టణం రైల్వే బ్రిడ్జి సమీపంలోని నీటి గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు ఎర్రిస్వామిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు గుంతలో పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పామిడి శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..పోలీసుల దర్యాప్తు
అనంతపురం జిల్లా పామిడి పట్టణం రైల్వే బ్రిడ్జి సమీపంలోని నీటి గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు ఎర్రిస్వామిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు గుంతలో పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.