ETV Bharat / state

పామిడి శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం..పోలీసుల దర్యాప్తు

author img

By

Published : Jan 17, 2021, 6:59 PM IST

గుంతలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
గుంతలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

అనంతపురం జిల్లా పామిడి పట్టణ శివారులోని రైల్వే బ్రిడ్జి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడం తీవ్రంగా కలకలం రేగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతపురం జిల్లా పామిడి పట్టణం రైల్వే బ్రిడ్జి సమీపంలోని నీటి గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు ఎర్రిస్వామిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు గుంతలో పడి చనిపోయాడా.. లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'పాల ఏకరి శంఖారావం జయప్రదం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.