ETV Bharat / state

Rowdy Sheeter Murder: రెండు రోజుల క్రితం రౌడీషీటర్ హత్య.. ఛేదించిన పోలీసులు

author img

By

Published : Jun 24, 2023, 10:33 AM IST

Etv Bharat
Etv Bharat

Rowdy Sheeter Kannababu Murder Case Updates : అనకాపల్లి జిల్లా ఊడేరులో రెండు రోజుల క్రితం జరిగిన రౌడీషీటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కన్నబాబును రౌడీషీటర్ చిన్ని లక్ష్మణరావు మరో ఇద్దరితో కలిసి హతమార్చినట్లు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు.

రౌడీ షీటర్‌ హత్య.. ముగ్గురు అరెస్టు

Rowdy Sheeter Murder : అనకాపల్లి జిల్లాలో రూ.లక్ష బకాయి కోసం ఇద్దరు రౌడీషీటర్ల మధ్య జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. అనకాపల్లి మండలం ఊడేరు సమీపంలోని పొలాల్లో జరిగిన రౌడీషీటర్ కన్నబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అనకాపల్లికి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ మురళీ కృష్ణ శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

కన్నబాబు(43) 2019 నుంచి అనకాపల్లిలోని గాంధీనగరంలో తల్లి రామయమ్మ, తమ్ముడు శివరామకృ ష్ణతో కలిసి ఉంటున్నాడు. కన్నబాబుపై విశాఖపట్నంలో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, దారి దోపిడీ కేసులు ఉన్నాయి. ఇతనిపై రౌడీషీట్ తెరిచారు. అనకాపల్లికి నివాసం మార్చాక విజయరామరాజు పేటకు చెందిన రౌడీషీటర్ చిన్ని లక్ష్మణరావు ఎలియాస్ లచ్చ (29), లోపింటి సురేంద్ర (37), గాంధీనగరానికి చెందిన పండూరి దుర్గారావు(29) లతో స్నేహం ఏర్ప డింది.

ఈ నేపథ్యంలో చోడవరానికి చెందిన ఓ మహిళకు చెందిన భూ సెటిల్మెంట్ వ్యవహా రంలో రాజాన కన్నబాబు తలదూర్చాడు. ఈ నెల 21న కన్నబాబు తన స్నేహితులైన ముగ్గురితో కలిసి చోడవరం వెళ్లారు. అక్కడ భూ వ్యవహారానికి సంబంధించి మాట్లాడారు. సాయంత్రం వరకు చోడవరంలో మద్యం తాగి తిరిగి రెండు బైకులపై అనకాపల్లి బయలుదేరారు. వెంకన్నపాలెం వద్ద మద్యం కొనుక్కుని ఊడేరు గ్రామంలోని పొలాల్లోకి వెళ్లి తాగారు. ఈ సమయంలో కన్నబాబు తనకు ఇవ్వాల్సిన రూ.లక్ష బకాయి కోసం లక్ష్మణరావు ఎలియాస్ లచ్చను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య తగాదా జరిగింది.

కన్నబాబును లచ్చ యూకలిప్టస్ కర్రతో తల, శరీర భాగాలపై కొట్టాడు. ఈ సమయంలో పండూరి దుర్గారావు కత్తితో తలపై కొట్టడంతో కన్నబాబు మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి నిందితులు చిన్ని లక్ష్మణరావు, పండూరి దుర్గారావు, లోపిన్ని సురేంద్రలను శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు బైకులు, హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన అనకాపల్లి డీఎస్​పీ వి.సుబ్బరాజు, గ్రామీణ సీఐ రవికుమార్, సిబ్బందిని ఎస్​పీ అభినందించారు. అదనపు ఎస్​పీ కైం సత్యనారాయణ పాల్గొన్నారు.

రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా : జిల్లాలో 229 మంది రౌడీషీటర్లు ఉన్నారని, వీరి కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఎస్​ హెచ్​ఓలకు ఆదేశాలిచ్చామని ఎస్​పీ తెలిపారు. ఎ రైనా భూ తగాదాలు, ఇతర నేరాల్లో తలదూరిస్తే పీడీ యాక్టు అమలు చేస్తామని హెచ్చరించారు.

వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం : ప్రకాశం జిల్లా దర్శిలో మేడ హనుమంతరావుకు చెందిన వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలోని సుమారు రెండు కోట్ల విలువైన సరుకు బూడిదైందని యజమాని తెలిపారు. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.