ETV Bharat / sports

నువ్వు చచ్చిపోతే బాగుండు అని అన్నారు: వరుణ్​

author img

By

Published : Oct 10, 2021, 10:23 PM IST

ఐపీఎల్​-2021.. భారత్​ నుంచి యూఏఈకి(ipl 2021 schedule) షిఫ్ట్​ అవ్వడానికి కరోనా కారణం. మే నెలలో కేకేఆర్​ ఆటగాడు వరుణ్​ చక్రవర్తికి(varun chakravarthy news) కరోనా సోకడం వల్ల తొలి కేసు బయటపడింది. ఆ తర్వాత మరికొందరు కొవిడ్​ బారిన పడటం వల్ల లీగ్​ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 'నువ్వు​ చచ్చిపోతే బాగుండేది' అంటూ చాలా మంది తనకు మెసేజ్​లు చేశారని చెప్పాడు వరుణ్​ చక్రవర్తి.

varun chakravarthy news
వరుణ్​ చక్రవర్తి

కోల్​కతా నైట్​ రైడర్స్​ ఆటగాడు వరుణ్​ చక్రవర్తికి(varun chakravarthy news) ఐపీఎల్​ 2021(ipl 2021 schedule) ఓ పీడకల లాంటింది. ఐపీఎల్​ తొలి దశలో అతడికే మొదటగా కొవిడ్​ సోకింది. అక్కడి నుంచి వివిధ జట్లలో ఆటగాళ్లకు పాజిటివ్​గా తేలడం వల్ల మొత్తం లీగ్​నే వాయిదా వేశారు. ఆదివారం(అక్టోబరు 10) వరల్డ్​ మెంటల్​ హెల్త్​ డే సందర్భంగా కేకేఆర్​ విడుదల చేసిన వీడియోలో.. ఆ చీకటి రోజులను గుర్తుచేసుకున్నాడు వరుణ్​. 'వరుణ్​ చచ్చిపోయుంటే బాగుండేది' అని ప్రజలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

"నాకు ఇంకా గుర్తు. డాక్టర్​ ఫోన్​ చేసి నాకు పాజిటివ్​ అని చెప్పాడు. నేను వణికిపోయాను. అంతా నాశనం అయిపోయింది అనిపించింది. ఇంత జరుగుతుంది(సీజన్​ వాయిదా) అని అప్పట్లో నేను ఊహించలేదు. ప్రజలు నాకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. 'కొవిడ్​ కన్నా వరుణ్​ మొత్తానికే చచ్చిపోయుంటే బాగుండేది' అంటూ ఇన్​స్టాగ్రామ్​లో నాకు మెసేజ్​లు పంపారు."

-- వరుణ్​ చక్రవర్తి, కేకేఆర్​ ఆటగాడు.

కేకేఆర్​ ఆటగాళ్లు వరుణ్​కు మద్దతుగా నిలిచారు. 'సామాజిక మాధ్యమాలు కాస్త దయకలిగి ఉండాలని అనిపించింది. తమ మాటల ప్రభావం ఎంత ఉంటుందనేది ప్రజలు ఆలోచించరు. మీమ్స్​, వీడియోలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ సమయంలో వారికి నచ్చింది మాట్లాడతారు. అది చదువుతున్న మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేది వారు పట్టించుకోరు,' అని సీనియర్​ ఆటగాడు దినేశ్​ కార్తిక్​ అన్నాడు.

వరుణ్​ ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడని, ప్రతి విషయాన్ని సీరియస్​గా తీసుకుంటాడని.. అలాంటిది అతడికి ఇలా జరగడం దురదృష్టకరమని టీమ్​ సభ్యులు అభిప్రాయపడ్డారు.

యూఏఈకి...

ఐపీఎల్​ తొలి దశలో.. ఆర్​సీబీతో మ్యాచ్​కు ముందు కేకేఆర్​ ఆటగాడు వరుణ్​ చక్రవర్తికి కరోనా సోకింది. దీంతో ఆ మ్యాచ్​ వాయిదా పడింది. ఆ తర్వాత టోర్నీలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఐపీఎల్​ను వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు నిర్ణయించారు. అలా మే నెలలో వాయిదా పడిన ఐపీఎల్​-2021.. యూఏఈలో సెప్టెంబర్​లో తిరిగి ప్రారంభమైంది.

ఇవీ చూడండి:-

'ఆ రెండు రోజులు నిద్ర పట్టలేదు'

వాసన, రుచి కోల్పోయినట్లు ఇప్పటికీ అనిపిస్తోంది: వరుణ్

Varun Chakravarthy News: బీసీసీఐకి 'వరుణ్‌' తలనొప్పి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.